News
పార్టీనీ వీడటం బాధగా ఉంది: వెంకయ్య
ఎన్డీఏ ఉపరాష్ట్రతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు ఇవాళ ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఏడాదిన్నర వయసులో తల్లిని కోల్పోయా.. పార్టీనే తల్లిగా భావిస్తూ జీవితం గడిపానని ఆయన తెలిపారు. "బీజేపీ వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నా.. పార్టీని వీడేటప్పుడు భావోద్వేగానికి గురయ్యానని వెంకయ్య మీడియాతో చెప్పారు. " నేను సాధారణ కుటుంబం నుంచి వచ్చాను.. నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నాను" అని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు విభిన్న పాత్ర పోషించబోతున్నా.. నా పాత్రకు న్యాయం చేస్తాననే అనుకుంటున్నాను. ఎంతోమంది ఉన్నతమైన వ్యక్తులు అధిరోహించిన స్థానానికి మరింత వన్నె తెచ్చేలా వ్యవహరిస్తాను" అని వెంకయ్య తెలిపారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం ప్రచారం చేసే ప్రసక్తేలేదు.. తనకు మద్దతిచ్చిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








